
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే అందరికీ అభిమాన నటిగా మారింది.

అయితే ఇప్పుడు భాగ్య శ్రీ బోర్సే పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనితో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే వీరిపై రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

ఇక తాజాగా వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఒకే గదిలో ఫోటో దిగారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ చేతికి ఉంగరం ఉంది ఎవరు తొడిగారు ? అని ఆడిగారు.

ఇందుకు భాగ్య శ్రీ బోర్సే స్పందిస్తూ అది నేనే కొనుక్కున్నాను అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోటోలతో పాటు ఆమె రిప్లై సైతం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ కలిసి డైరెక్టర్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్నారు.

ఇందులో సాగర్ పాత్రలో రామ్ కనిపించనుండగా.. మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ నటిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతోపాటు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంత చిత్రంలో నటిస్తుంది.