
ప్రస్తుతం కుర్రకారు క్రష్ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోయిన్ ఆమె. కొన్ని రోజులుగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. మరోవైపు తన అందాలతో ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో నిలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట హాట్ టాపిక్ అయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. 1995 మే 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జన్మించిన ఆమె.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. యారియన్ 2 సినిమాతో నటిగా హిందీ సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఛాంపియన్ అనే సినిమాలో అతిథి పాత్రలో నటించింది. 2024లో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరియమైంది. ఈ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూవీ ప్లాప్ అయినప్పటికీ ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది.

ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. చివరగా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కనిపించింది ఈ అమ్మడు.

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ గ్లామర్ లుక్స్ లో కట్టిపడేస్తుంది భాగ్య శ్రీ. క్రీమ్ అండ్ లైట్ మెరూన్ కాంబినేషన్ లో ఒక లాంగ్ ఫ్రాక్ ధరించి కనిపించింది. ప్రస్తుతం ఆమె లెనిన్ చిత్రంలో నటిస్తుంది.