
1. వైజయంతి ప్రొడక్షన్ బ్యానర్ అధినేత అశ్వనీ దత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారాయన.

అశ్వనీదత్ కూతుళ్లు కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర చిత్రాలను నిర్మించి వైజయంతీ బ్యానర్ కు పునర్వైభవం తీసుకొచ్చారు

ఇక గతేడాది ప్రభాస్ తో నిర్మించిన కల్కి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయ్యింది. ఈ సినిమా సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

అశ్వనీదత్ పెద్ద కూతురు స్నప్న, రెండో కూతురు ప్రియాంక, అల్లుడు నాగ్ అశ్విన్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఆయన మూడో కూతురు స్రవంతి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలీదు.

ఇటీవల స్రవంతి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని అశ్వనీదత్ ఇంట్లోనే ఈ శుభాకార్యం జరిగినట్లు తెలుస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

తాజాగా స్రవంతి ఎంగేజ్ మెంట్ ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఇవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అశ్వనీదత్ కు కాబోయే అల్లుడు ఎవరో మాత్రం తెలియరాలేదు.