స్టార్ యాంకర్ గా రాణిస్తున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడికి విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. పలు షోల్లో తన మాటలతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రష్మీ గౌతమ్.
శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోల్లో తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇక ఈ ముద్దుగుమ్మ అందంతోనూ ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
రోజు రకరకాల ఫోటో షూట్స్ తో అలరిస్తూ ఉంటుంది. నెంట్టింట రష్మీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే గ్లామర్ షోతోనూ కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది రష్మీ.
అలాగే తన పై వచ్చే ట్రోల్స్ కు కూడా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటుంది. తాజాగా తనను ట్రోల్ చేస్తున్న వారిపై మండిపడింది రష్మీ. తాజాగా సనాతన ధర్మంపై పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేసింది రష్మీ. దాంతో ఆమె పై ఒక్కసారిగా నెటిజన్స్ ఫైర్ అయ్యారు.
ఈ వీడియో షేర్ చేయడం పై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. దానికి రష్మీ కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు. నా నమ్మకాలు, నా ఇష్టాల గురించి మీకెందుకు? అయినా నేనెందుకు సిగ్గు పడాలి? ఏమతం సరిగ్గా ఉందో చెప్పండి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.