ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లింది వరలక్ష్మి. కుటుంబ సమేతంగా పెళ్లిక రావాలని తలైవాను ఆహ్వానించింది.
వరలక్ష్మి వెంట రాధిక, ఆర్ శరత్ కుమార్ లు కూడా ఉన్నారు. ఈ మేరకు రజనీకాంత్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ కాబోయే పెళ్లి కూతురు.
' తలైవా సర్ను, లతా ఆంటీని కలిసి మా పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్. ఐశ్వర్య రజనీకాంత్.. నువ్వెప్పటిలాగే ఎంతో ప్రేమగా మాట్లాడావు' అని రాసుకొచ్చింది వరలక్ష్మి
ఈ ఫోటోల్లో రజనీకాంత్ దంపతులతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక- శరత్కుమార్ ఉన్నారు. కాగా ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో మార్చిలో నిశ్చితార్థం చేసుకుంది వరలక్ష్మి.
జూలై 2న థాయ్ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- నికోలయ్ సచ్ దేవ్ తో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
తెలుగులో నాలి రామకృష్ణ ఎల్ఎల్బీ, జాంబి రెడ్డి, నాంది, యశోద, వీరసింహా రెడ్డి, మైఖేల్ చిత్రాల్లో నటించింది వరలక్ష్మి. ఇటీవలే హనుమాన్ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకుంది.