
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ చేసుకున్న తమన్నా ఇప్పుడు డిజిటల్ వేదికపై తన సత్తా చాటుతుంది.

ఇప్పటికే 'లెవన్త్ అవర్', 'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్ లలో నటించి.. సూపర్ హిట్ అందుకుంది తమన్నా.

తాజాగా తమన్నాకు మరో వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు మిల్కి బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

రొమాంటికి డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ లోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సిరీస్ కు అరుణిమా శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో తమన్నా నెగిటివ్ రోల్ లో కనిపించనుందట.

ఇప్పటికే ఈ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ చిత్రనిర్మాతలతో భారీ డీల్ కూడా కుదుర్చుకున్నట్లుగా టాక్.

2022లో ఈ సిరీస్ విడుదల కానుందని.. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం..

ప్రస్తుతం తమన్నా.. ఎఫ్ 3లో నటిస్తుండగా.. నితిన్ హీరోగా వస్తున్న మ్యాస్ట్రో మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది.