
ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ చాలా బిజీగా ఉంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ నటుడు జయం రవి, నటి ప్రియాంక మోహన్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

అందులో జయం రవి, ప్రియాంక మెడలో దండలు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు నెట్టింట వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్ పై స్పందించింది ప్రియాంక.

న గురించి వచ్చిన కథనాలు చూసి తాను షాకయ్యానని.. ఇలా జరుగుతుందని అసలు ఉహించలేదని తెలిపింది. జయం రవి, తాను కలిసి బ్రదర్ సినిమా కోసం వర్క్ చేశామని.. ఆ సినిమా ప్రమోషన్లలో ఆ ఫోటో రిలీజ్ అయ్యిందని తెలిపిందే.

ఆ సినిమాలో తామిద్దరం మెడలో పూలదండలు వేసుకుని ఉంటామని.. దాంతో అది నెట్టింట వైరల్ గా మారడంతో.. అది చూసిన చాలా మందికి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందనుకున్నారని చెప్పుకొచ్చింది. వరుస షూట్స్ తో బిజీగా ఉంటడంతో ఆ విషయం తన దృష్టికి రాలేదన తెలిపింది.

ఆ సమయంలో వచ్చిన రూమర్స్ నిజమని నమ్మిన టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు ఫ్రెండ్స్ తనకు కాల్స్ చేసి కంగ్రాట్స్ చెప్పారని.. దీంతో ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని తెలిపింది. ఆ తర్వాత విషయం తెలుసుకుని అది సినిమా అని చెప్పినట్లు తెలిపింది.