
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో ప్రణీత సుభాష్ ఒకరు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినా ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తనీష్ జోడిగా ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత సిద్ధార్థ్ సరసన నటించిన బావ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో ఈ అమ్మాడి క్రేజ్ మారిపోయింది.

అలాగే ఎన్టీఆర్ తో రభస, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించి అలరించింది. తెలుగులో ఈ బ్యూటీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అందం, అభినయం ఎంత ఉన్నా ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు.

2021లో బెంగుళూరుకు చెందిని బిజినెస్ మెన్ నితిన్ రాజును వివాహం చేసుకున్న ప్రణీత .. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వీరికి 2022లో పాప జన్మించింది. కొన్నాళ్లు సైలెంట్ అయిన ప్రణీత.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

వరుస ఫోటోస్ షేర్ చేస్తూ తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఆకుపచ్చ పట్టుచీరలో కుందనపు బొమ్మల మెరిసిపోయింది ప్రణీత. అంతేకాదు.. తన కూతురితో కలిసి ప్రణీత దిగిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ప్రణీత కూతురు కూడా అచ్చం తల్లిలాగే ఎంతో అందంగా ముద్దుగా కనిపిస్తుంది. పట్టుచీరలో సంప్రదాయ పద్దతిలో కనిపిస్తున్న