కంచె సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది ప్రగ్య జైస్వాల్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ప్రగ్య జైస్వాల్.
12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జన్మించింది ప్రగ్య జైస్వాల్. ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి కూడా ఈమెకు ఉంది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో అవకాశం లభించింది. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటరిచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.
2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇచ్చింది. అయితే, ఆసినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు. క్రిష్ తరువాతి చిత్రమైన కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చాడు.
ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారింది.