
సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది లయ. తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది లయ. అయితే పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.

గతేడాది నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది లయ. ఇక ఈ ఏడాది శివాజీతో కలిసి సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.

సెకెండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది లయ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది లయ.

తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది లయ. అలాగే తన ఫ్యామిలీ ఫొటోస్, వీడియోలను కూడా అందులో షేర్ చేస్తుంటుందీ అందాల తార

తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్లిపోయింది లయ. అలాగే ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో లయ కూతురు శ్లోక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ స్టార్ కిడ్ అచ్చం అమ్మలాగే ఉందంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.