పాన్ ఇండియా హీరోయిన్ అయినా నో ఛాన్స్.. నిధి అగర్వాల్‌కు ఆఫర్స్ కరువు..

29 June 2026

Pic credit - Instagram

Rajeev 

నిధి అగర్వాల్.. తెలుగులోనే తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేసింది. 

2014 యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్స్ వరకి వచ్చింది. 2017లో టైగర్ ష్రాఫ్‌ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధి అగర్వాల్ తొలిచిత్రం.

అలాగే 2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. 

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రంతో నిధి అగర్వాల్‌ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. 

తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కు హిట్స్ మాత్రం అంతగా పడలేదు.

చివరిగా వచ్చిన రాజా సాబ్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.