
అందాల భామ కీర్తిసురేష్ తెలుగు తమిళ్ సినిమాలతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించింది కీర్తి సురేష్. సావిత్రి పాత్రకు గానూ జాతీయ అవార్డును అందుకుంది ఈ అందాల భామ.

కీర్తి సురేష్ తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ వంటి పాన్-ఇండియన్ భాషలలో కూడా ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. తెలుగులో చాలా సమంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ అమ్మడు.

ఇటీవలే ఈ చిన్నది నటించిన రఘుతాత అనే సినిమా విడుదలైంది. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, కీర్తి సురేష్ తన మొదటి జీతం గురించి మాట్లాడింది. తన మొదటి జీతం రూ. 500అని చెప్పింది

కీర్తి సురేష్ తొలిసారిగా ఫ్యాషన్ షోలలో బట్టలు సరిచేసే పని చేసింది. ఇందుకోసం ఆమెకు తొలి వేతనంగా రూ.500 ఇచ్చారు. ఇది తన మొదటి జీతం అని కీర్తి సురేష్ తెలిపింది. ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.