
టాలీవుడ్ లో ఈ మధ్య కొత్త భామలు తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. అలాంటి వారిలో బాగ్యా శ్రీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్ళ క్రష్.

మాస్ మహారాజా రవితేజ సరసన ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిరాశపరిచింది.

తొలి సినిమాతోనే ఈ అమ్మడు అందరి మనసులు దోచేసింది. తన అందంతో ప్రేక్షకులకు ముఖ్యంగా కుర్రకారుకు పిచ్చెక్కించింది. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ లో ఈ బ్యూటీని చూసి ఫిదా అయ్యారు ఆడియన్స్.

ఉత్తరాదికి చెందిన భాగ్యశ్రీకి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అనుభవం లేదు. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘చందు ఛాంపియన్’లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార.అంతకు ముందు యారియాన్ 2లో నటించింది ఈ వయ్యారి.

తెలుగులో మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. కాగా సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది భాగ్యశ్రీ.