
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురి అదితి శంకట్ ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ చిన్నది కేవలం నటి మాత్రమే కాదు గాయని, డాక్టర్ కూడా.. ప్రధానంగా తమిళ చలనచిత్రాలలో నటిస్తూ ఆకట్టుకుంటుంది అదితి. నటిగా, సింగర్ గా దూసుకుపోతుంది ఈ చిన్నది.

నటన పట్ల ఆసక్తితో, 2022లో ఎం. ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన తమిళ బ్లాక్బస్టర్ చిత్రం విరుమాన్ లో కార్తీ సరసన నటించి సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – సౌత్ లభించింది.

ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ (2023) చిత్రంలో కూడా నటించింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యింది. తెలుగు రవితేజ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

గాయనిగా, ఘని అనే తెలుగు చిత్రంలో "రోమియోకి జూలియట్" పాటతో ఆమె ప్లేబ్యాక్ సింగర్గా అడుగుపెట్టింది మరియు విరుమాన్లో "మదుర వీరన్" పాటను పాడింది. ఇక ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

భైరవం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది ఈ భామ. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్లతో కలిసి నటించింది. ఈ చిత్రం మే 30, 2025న విడుదల కానుంది. ఈ సినిమాతో ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.