
ప్రస్తుత జీవనశైలిలో అందరూ అలవాట్లు నిముషాల్లోనే మారిపోతున్నాయి. వాటిలో ఆహారపు అలవాట్లు కూడా . ఇంట్లో చేసుకుని తినే టైం కూడా లేదు. ఆన్లైన్ లో ఆర్డర్స్ పెట్టుకుని తింటున్నారు దీని వలన ఉన్నవి సరిపోనట్టు కొత్త అనారోగ్య సమస్యలుఎక్కువవుతున్నాయి. కాబట్టి, ఆహార విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా అవసరం. శరీరానికి బలాన్ని ఇచ్చే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.

హీరో జగపతి బాబుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందరూ నవ్వే వాళ్లు ఆ రోజుల్లో నేను ఇదే తిన్నాను అంటూ ఓపెన్ గా జగపతి బాబు చెప్పడంతో ఆ వంటకాలు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చాయి. వీడియోలో " మూడేళ్ళ క్రితం సద్ది పప్పు చారు, సద్ది పెరుగు అన్నం తినే వాడిని చూసి అందరూ నవ్వే వాళ్ళు ఆ రోజుల్లో ఇదే కదా తిన్నది బతికింది " అని ఆయన మాటల్లో అన్నారు ఇవి ఎప్పటి నుంచో ఫేమస్.

నిజం చెప్పాలంటే ఈ రెండు వంటకాలు పేదోళ్ళో ఇంట్లో పుట్టాయి. వాళ్ళు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఉదయం పూట తినేవాళ్లు. అలా సద్ది అన్నం బయటకు వచ్చింది. అది ఉండగా ఉండగా సద్ది పెరగన్నంలా మారింది. కొందరు దీనిలో పెరుగు, పచ్చి ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు వేసుకుని తింటారు. ఈ రుచి ఎక్కడా దొరకదు అంత టేస్టీగా ఉంటుంది. రోజూ తింటే బలంగా ఉంటారు.

సద్ది పప్పు చారు అన్నాన్ని మిగిలిపోయిన అన్నంతో చేస్తారు. దీని కోసం ముందు రోజు చేసిన అన్నం, పప్పు చారును తీసుకుని దీనిలో మంచిగా కలుపుకుని తీసుకోవాలి. ఇంకా ఇది అద్భుతమైన, సాంప్రదాయ వంటకం కూడా దీనిని తింటే ఒంటికి ఎంతో చలువ చలువ చేస్తుంది అలాగే, ఇది జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

సద్ది అన్నం : ఇంకా మిగిలిన అన్నంలో కొద్దిగా పాలు, పెరుగు వేస్తే అది మంచిగా తోడుకుంటుంది. ఇంకా దీనిని మీరు రాత్రంతా కలిపి ఫ్రిజ్లో పెడితే ఉదయాన్నే టిఫిన్ గా తయారవుతుంది. ఇంకా దీనిలో నాలుగు పచ్చి ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చిని వేసి దీనిని నంజుకుని ఆ రుచే వేరు.