Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మార్చి 15 నుంచి కొత్త టైమింగ్స్.. మార్పులు ఇవే..

Updated on: Mar 09, 2026 | 5:15 PM

వందే భారత్ రైళ్లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రైళ్ల టైమింగ్స్‌లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్స్‌లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ వివరాలపై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని రైల్వేశాఖ సూచించింది.

1 / 5
తెలుగు రాష్ట్రాల వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్. మార్చి 15వ తేదీ నుంచి పలు రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రెండు వందే భారత్ ట్రైన్ల సమయాలను సవరించింది. పలు రూట్లను ఈ కొత్త షెడ్యూల్ ప్రభావం చేయనుంది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్. మార్చి 15వ తేదీ నుంచి పలు రైళ్ల టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రెండు వందే భారత్ ట్రైన్ల సమయాలను సవరించింది. పలు రూట్లను ఈ కొత్త షెడ్యూల్ ప్రభావం చేయనుంది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
రెండు వందే భారత్ రైళ్ల సమయాలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. ప్రయాణాలను ప్లాన్ చేసుకునేముందు అప్డేట్ అయిన సమయాలను తనిఖీ చేయాలని రైల్వేశాఖ సూచించింది.  ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లాంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఈ రైళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.

రెండు వందే భారత్ రైళ్ల సమయాలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. ప్రయాణాలను ప్లాన్ చేసుకునేముందు అప్డేట్ అయిన సమయాలను తనిఖీ చేయాలని రైల్వేశాఖ సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లాంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఈ రైళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.

3 / 5
యశ్వంత్ పూర్-కాచిగూడ రైళ్ల సమయాలు మారాయి. గతంలో ఈరైలు హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.48 గంటలకు చేరుకునేది. ఆ తర్వాత 3.50 గంటలకు బయల్దేరేది. ఇక నుంచి ఇది 3.55 గంటలకు చేరుకుని 3.57 గంటలకు బయలుదేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఇది మధ్యాహ్నం 12.08 గంటలకు చేరుకుని 12.10 గంటలకు బయల్దేరుతుంది. ఇక నుంచి 12.17 గంటలకు చేరుకుని 12.19 గంటలకు బయల్దేరనుంది.

యశ్వంత్ పూర్-కాచిగూడ రైళ్ల సమయాలు మారాయి. గతంలో ఈరైలు హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.48 గంటలకు చేరుకునేది. ఆ తర్వాత 3.50 గంటలకు బయల్దేరేది. ఇక నుంచి ఇది 3.55 గంటలకు చేరుకుని 3.57 గంటలకు బయలుదేరుతుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఇది మధ్యాహ్నం 12.08 గంటలకు చేరుకుని 12.10 గంటలకు బయల్దేరుతుంది. ఇక నుంచి 12.17 గంటలకు చేరుకుని 12.19 గంటలకు బయల్దేరనుంది.

4 / 5
ఇక కలబురగి-బెంగళూరు వందే భారత్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌కుక ఇక నుంచి ఉదయం 11.00 గంటలకు బదులు 11.13 గంటలకు చేరుకుంటుంది. ఇక యలహంక జంక్షన్‌కు మధ్యాహ్నం 12.28కి బదులు 12.30 గంటలకు చేరుకుంటుంది. ఇక బెంగళూరు-కలబురగి మధ్యాహ్నం 3.05 గంటలకు గతంలో యలహంక స్టేషన్‌కు చేరుకునేది.

ఇక కలబురగి-బెంగళూరు వందే భారత్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌కుక ఇక నుంచి ఉదయం 11.00 గంటలకు బదులు 11.13 గంటలకు చేరుకుంటుంది. ఇక యలహంక జంక్షన్‌కు మధ్యాహ్నం 12.28కి బదులు 12.30 గంటలకు చేరుకుంటుంది. ఇక బెంగళూరు-కలబురగి మధ్యాహ్నం 3.05 గంటలకు గతంలో యలహంక స్టేషన్‌కు చేరుకునేది.

5 / 5
అయితే ఇప్పటినుంచి 3.09 గంటలకు యలహంక స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక ప్రశాంతి నిలయం స్టేషన్‌కు సాయంత్రం 4.23కి బదులు 4.45 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులకు మారిన టైమ్ షెడ్యూల్స్‌ను గమనించి ప్లాన్ చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది.

అయితే ఇప్పటినుంచి 3.09 గంటలకు యలహంక స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక ప్రశాంతి నిలయం స్టేషన్‌కు సాయంత్రం 4.23కి బదులు 4.45 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులకు మారిన టైమ్ షెడ్యూల్స్‌ను గమనించి ప్లాన్ చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us