
పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సుకన్య సమృద్ది యోజన, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లాంటివి బాగా పాపులర్ అవ్వగా.. మరికొన్ని అంతగా పాపులర్ అవ్వలేదు. వాటిల్లో కిసాన్ వికాస్ పత్ర అనేది ఒకటి. దీనిని సింపుల్గా కేవీపీగా పిలుస్తారు. చిన్న పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. రిస్క్ లేకుండా ప్రభుత్వ గ్యారంటీతో రాబడి పొందాలనుకునేవారికి కేవీపీ మంచి స్కీమ్. ఈ పథకం పూర్తి వివరాలు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చిన్న పథకాల్లో కిసాన్ వికాస్ మిత్ర ఒకటి. దీని వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. చక్రవడ్డీ కూడా ప్రతీ ఏడాది లభిస్తుంది. దీంతో మీ డబ్బులు డబుల్ అవుతాయి. కాలక్రమేణా వడ్డీ రేట్లు మరింత పెరిగితే మీకు వచ్చే ఆదాయం కూడా మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

ఉదాహరణకు ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెడితే.. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం రూ.2 లక్షలకు చేరుకుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రోజువారీ మార్కెట్ ధరల హెచ్చుతగ్గులతో ఈ పథకం అనుసంధానించబడి లేదు. దీని వల్ల మీ పొదుపు భద్రంగా ఉంటుంది. మార్కెట్లో పడిపోయినప్పుడు ఆందోళన చెందాల్సిన పని ఉండదు.

పెట్టుబడి పెట్టిన తర్వాత అవసరమైతే మీరు మధ్యలో విత్ డ్రా చేసుకోవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ 30 నెలలు ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో డబ్బులు పొందాలనుకునేవారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. అయితే ఈ స్కీములో పెట్టుబడి పెట్టుముందు వడ్డీ రేట్లు, నియమ నిబంధనల గురించి తెలుసుకోండి. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.

ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటు ఉండగా.. మీరు పెట్టిన డబ్బులు 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతాయి. దీర్ఘకాలంలో మీ చేతికి బల్క్గా డబ్బులు అందుతుంది. సమీపంలోని పోస్టాఫీస్కు వెళ్లి ఈ అకౌంట్ తెరవొచ్చు. ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది.