
ప్లాట్ఫామ్ ఇండస్ ఓఎస్.. డీల్ అంచనా రూ.440 కోట్లు కంటెంట్, యాప్ డిస్కవరీ ప్లాట్ఫామ్ ఇండస్ ఓఎస్ను డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్ పే సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదిరితే ఫోన్ పే 6 కోట్ల డాలర్లు(సుమారు రూ. 440 కోట్లు) చెల్లించే అవకాశమున్నట్లు అంచనా వేశాయి.

తద్వారా ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్స్టైల్ తదితర విభాగాలతో కూడిన సూపర్ యాప్ ‘స్విచ్’ను ఫోన్ పే మరింత విస్తరించే వీలుంది. పలు విభాగాలకు చెందిన సర్వీసులను ఒకే గొడుగు కింద అందించేందుకు స్విచ్ను ఫోన్పే రూపొందించింది. దేశీ భాషల కంటెంట్ ద్వారా ఇండన్ ఓఎస్ కస్టమర్లకు దగ్గరైంది. ఇండస్ ఓఎస్ కొనుగోలు ద్వారా ఫోన్ పే స్థానిక డెవలపర్స్ను ఆకట్టుకునేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.

కాగా, దేశీయంగా యూపీఐ చెల్లింపులతో ఫోన్ పే టాప్ ర్యాంక్ థర్డ్ పార్టీ ప్రాసెసర్గా నిలుస్తోంది. ఏప్రిల్లో 119 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. వీటి విలువ రూ. 2.34 లక్షల కోట్లు కాగా, దాదాపు 45 శాతం మార్కెట్ వాటాకు సమానమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.