
Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త, సరసమైన వినోద ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ సంస్థ రూ.55 కే 'జియోటీవీ ప్రో ప్యాక్'ను ప్రారంభించింది. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్యాక్తో వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూడవచ్చు. ఈ కొత్త ప్లాన్లో 150కి పైగా ప్రీమియం ఛానెళ్లతో సహా 16కు పైగా భాషలలో ఛానెళ్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. వీక్షకులు వినోదం, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, జీవనశైలి, ప్రాంతీయ భాషలకు సంబంధించిన కంటెంట్ను చూడవచ్చు.

Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త, సరసమైన వినోద ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ సంస్థ రూ.55 కే 'జియోటీవీ ప్రో ప్యాక్'ను ప్రారంభించింది. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్యాక్తో వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూడవచ్చు. ఈ కొత్త ప్లాన్లో 150కి పైగా ప్రీమియం ఛానెళ్లతో సహా 16కు పైగా భాషలలో ఛానెళ్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. వీక్షకులు వినోదం, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, జీవనశైలి, ప్రాంతీయ భాషలకు సంబంధించిన కంటెంట్ను చూడవచ్చు.

Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త, సరసమైన వినోద ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ సంస్థ రూ.55 కే 'జియోటీవీ ప్రో ప్యాక్'ను ప్రారంభించింది. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్యాక్తో వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూడవచ్చు. ఈ కొత్త ప్లాన్లో 150కి పైగా ప్రీమియం ఛానెళ్లతో సహా 16కు పైగా భాషలలో ఛానెళ్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. వీక్షకులు వినోదం, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, జీవనశైలి, ప్రాంతీయ భాషలకు సంబంధించిన కంటెంట్ను చూడవచ్చు.

ఛానెల్లను ఎలా చూడాలి? : ఈ సేవను పొందడానికి వినియోగదారులు రూ.55తో రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసిన తర్వాత మీ జియో నంబర్తో జియోటీవీ యాప్లోకి లాగిన్ అయితే చాలు. అందుబాటులో ఉన్న అన్ని ప్రీమియం ఛానెల్లు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. దీనికి ప్రత్యేక యాక్టివేషన్ ప్రక్రియ అవసరం లేదు.

వాయిస్ కాల్స్, SMS ఫీచర్లు ఉంటాయా? : ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాక్ మాత్రమేనని జియో స్పష్టం చేసింది. ఇందులో వాయిస్ కాల్స్ లేదా SMS వంటి ఫీచర్లు ఉండవు. ఈ సేవను ఉపయోగించడానికి వినియోగదారులకు యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్యాక్ ఒకేసారి ఒక మొబైల్ పరికరంలో మాత్రమే జియోటీవీ యాప్కు యాక్సెస్ అందిస్తుంది.

కొత్త రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ను ఆన్లైన్, ఆఫ్లైన్ ఛానెళ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చని జియో ప్రకటించింది. దీనితో వీక్షకులు ఇప్పుడు తమకు ఇష్టమైన టీవీ సీరియల్స్, తాజా వార్తలు, పిల్లల కార్టూన్లు, ప్రాంతీయ భాషా కార్యక్రమాలను చాలా సరసమైన ధరకే చూడవచ్చని కంపెనీ తెలిపింది.