
యూపీఐ వంటి యాప్లు నిమిషాల్లో చెల్లింపు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ డిజిటల్ చెల్లింపుల యుగంలో ఆన్లైన్ చెల్లింపు సాధ్యం కాని ప్రదేశాలలో మనకు చాలాసార్లు నగదు అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆధార్ కార్డు ద్వారా కూడా డబ్బు తీసుకోవచ్చు.

ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్ లేదా ATM అవసరం లేకుండా మీ ఆధార్ కార్డ్ని ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీని కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS)ని ప్రారంభించింది. దీని ద్వారా మైక్రో ఏటీఎంలో వేలిముద్ర ద్వారా డబ్బు తీసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ నుండి డబ్బును విత్డ్రా చేయడానికి మీ ఆధార్ నంబర్ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం అవసరమని గుర్తించుకోండి. ఇది లింక్ చేయకపోతే ముందుగా బ్యాంక్కి వెళ్లి లింక్ చేసుకోండి. అప్పుడు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే మీ సమీపంలో ఉన్న ఏటీఎం కాకుండా ఏదైనా మైక్రో ఏటీఎంకి వెళ్లాలి. అక్కడ మీ ఆధార్ నంబర్ను నమోదు చేసి, మీ వేలిముద్రను స్కాన్ చేయడం ద్వారా మీరు డబ్బును సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ సులభం, సురక్షితమైనది.

ముందుగా మైక్రో ఏటీఎంకు చేరుకుని మీ ఆధార్ నంబర్ను నమోదు చేయండి. దీని తర్వాత, వేలిముద్ర స్కానర్పై మీ వేలిని ఉంచండి, తద్వారా మీ గుర్తింపు ధృవీకరించబడుతుంది. ఇప్పుడు మీ ముందు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.

మీ మనీని ఉపసంహరించుకోండి అనే ఆప్షన్ ఎంపిక చేసుకోండి. దీని తర్వాత మీరు విత్డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి. ఉదాహరణకు.. రూ.1000 లేదా రూ.2000 లేదా ఏవైనా ఆప్షన్లు అందుబాటులో ఉంటే మీరు మీ అవసరానికి తగిన ఎంపికను ఎంచుకోండి. ఆ తర్వాత మీ ఖాతా నుండి నగదు డెబిట్ అవుతుంది.