
బంగారం ధరలు గంటల వ్యవధిలోనే తారుమారయ్యాయి. రోజురోజుకి భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియడం లేదు. దీంతో కొనుగోలుచేసేవారు ఆందోళనకు గురవుతున్నారు. గత వారంలో గోల్డ్ రేట్లు రూ.3 వేల మేర పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి.

సోమవారం బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. భారతదేశ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద ఉండగా.. ఇవాళ రూ.430 మేర పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా కొనసాగుతోండగా.. నేడు రూ.400 పెరిగాయి. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ఉంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,360గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,990 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,450గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ఉంది.

ఇక వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగానే ఉంది. ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,54,900గా ఉండగా.. హైదరాబాద్లో రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.

అయితే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అయితే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడికి దిగాయంటూ ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం బంగారం ధరలపై కూడా పడుతోంది.