
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీలో తాజాగా మార్కెట్లోకి కొత్త బైక్ను తీసుకొచ్చింది.

సీబీ500 ఎక్స్ పేరుతో తీసకొచ్చిన ఈ కొత్త బైక్కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిదీ కంపెనీ.

ఇక 500 సీసీతో రూపొందించిన ఈ అడ్వెంచర్ ప్రీమియం బైక్ ధర అక్షరాల రూ.6.87 లక్షలు కావడం విశేషం.

500 సీసీ మోడల్ బైక్ల కోసం చూస్తున్న వారికి సీబీ500 ఎక్స్ మంచి ఆప్షన్ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఆరు గేర్లతో ఉండే ఈ బైక్ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 47 బీహెచ్పీని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అనే ఫీచర్ను తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా సడెన్గా బ్రేక్ వేస్తే.. ఆటోమేటిక్గా ముందూ వెనుక లైట్లు ఆన్ అవుతాయి.

ఈ బైక్ ప్రత్యర్థి కంపెనీలు.. టీఆర్కే502, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, కేటీఎం 390 అడ్వెంజర్, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్, సుజుకీ వీ-స్రోమ్ 650 ఎక్స్టీ వంటి బైక్లకు గట్టి పోటినిస్తుందని హోండా భావిస్తోంది.