
బంగారం ధరలు భారీగా షాకిచ్చాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆమాంతం పెరగడంతో కొనుగోలు చేయాలనుకునేవారు షాక్ అవుతున్నారు. అయిso గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో జీవితకాలపు గరిష్ట స్థాయికి ధరలు చేరుకోగా.. ఆ తర్వాత ఈ నెలలో భారీగా పెరిగాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి మళ్లీ పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.3160 పెరుగుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.2900 పెరిగిందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,460 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.3280 మేర పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,500గా ఉండగా.. మంగళవారం రూ.3 వేలు పెరిగింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200గా ఉంది.

అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350గా ఉంది. ఒక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ సోమవారం రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. నేడు రూ.2.55లకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే రూ.10 వేల మేర పెరిగింది.

హైదరాబాద్లో నిన్న కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. మంగళవారం నాటికి రూ.2.60 లక్షలు పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. బెంగళూరలో రూ.2.55 లక్షలు పలుకుతోంది.