
బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్. ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం నుంచి ధరలు పడిపోతూ వస్తోండగా.. రెండు రోజుల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బుధవారం ధరలు ఆమాంతం పెరిగాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,570 వద్ద కొనసాగుతుండగా.. మంగళవారంతో పోలిస్తే రూ.770 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,31,600గా ఉండగా.. ఇవాళ రూ.700 పెరిగింది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,780 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.320 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,31,800గా ఉండగా.. నేడు రూ.300 పెరిగింది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,270 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,750గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,570 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,600గా కొనసాగుతోంది.

అటు సిల్వర్ ధరలు కూడా పెరిగాయి.. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.35 లక్షలు పలుకుతోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.40 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.35 లక్షలుగా ఉంది. చెన్నైలో రూ.2.40 లక్షలుగా ఉండగా.. బెంగళూరులో రూ.2.35 లక్షల వద్ద ఉంది.