
బంగారం కొనాలనుకునేవారికి షాక్. గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల మూడు రోజుల పాటు ధరలు పతనమవ్వగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తడంతో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన చేయడంతో గోల్డ్ రేట్లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

శుక్రవారం బంగారం ధరలు పెరగ్గా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గోల్డ్ రేట్ల విషయానికొస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,820 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ రూ.380 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,32,750గా ఉండగా.. నేడు రూ.350 పెరిగింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,45,640గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,500 వద్ద కొనసాగతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,820 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,750గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,950 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,900గా ఉంది.

ఇక వెండి ధరల విషయానిస్తే హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో కూడా ఇదే రేటు పలుకుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షలుగా ఉండగా.. ఢిల్లీలో రూ.2.40 లక్షలుగా ఉంది. ఢిల్లీలో గురువారం రూ.2.35 లక్షల వద్ద ట్రేడవ్వగా.. ఇవాళ రూ.2.40 లక్షలకు చేరుకుంది.

అటు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4120 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గురువారం 4050 డాలర్ల వద్ద కొనసాగింది. అటు సిల్వర్ ధర 60 డాలర్ల వద్ద ఉంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వరుసగా ధరలు తగ్గగా.. ఇప్పుడు వరుసగా పెరుగుతూ వస్తోన్నాయి.