
గోల్డ్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ధరలు పతనాన్ని చవిచూశాయి. గత మూడు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఇవాళ తగ్గడంతో కొనుగోలుచేయాలనుకునేవారు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఆగస్ట్ 14న దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,590 పలుకుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.710 మేర క్రాష్ అయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,150 వద్ద కొనసాగుతుండగా.. శుక్రవారం రూ.650 కుప్పకూలింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,140 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,210 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,890 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,040 పలుకుతుండగా.. ఒక్కరోజే రూ.710 మేర పడిపోయాయి. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,300గా ఉండగా.. ఇవాళ రూ.650 మేర కుప్పకూలాయి. ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో నిన్న రూ.2.60 లక్షలు పలకగా.. ఇవాళ రూ.2,59,900కి చేరుకున్నాయి. చెన్నైలో రూ.2,59,900 పలుకుతుండగా.. బెంగళూరులో కిలో వెండి రూ.2.55 లక్షలుగా ఉంది.