
పండుగల సీజన్ కావడంతో గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూ్స్. పసిడి ధరలు ఒకేసారి భారీగా పతనమయ్యాయి. గంటల వ్యవధిలోనే ఉన్నట్లుండి అనూహ్యంగా పతనమయ్యాయి. గత రెండు రోజులుగా పసిడి ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ పడింది. వినాయక చవితి, దసరా వంటి పండుగలు వస్తుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పతనం తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 11వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,52,890కి చేరుకోగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2620 మేర పడిపోయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,150 పలుకుతుండగా.. శుక్రవారం ఏకంగా రూ.2400 డౌన్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,890కే లభిస్తుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,150కి క్రాష్ అయింది. శుక్రవారం ఏకంగా రూ.2 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,890గా ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే రూ.2620 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,150 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2400 పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,040 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,300గా కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా రూ.2 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది. అటు వెండి ధరలు కూడా భారీగా క్రాష్ అయ్యాయి. ఏకంగా రూ.10 వేలు తగ్గింది.

ఢిల్లీలో కిలో వెండి రూ.2.45 లక్షలుగా ప్రస్తుతం ఉండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద స్ధిరపడింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేల మేర తగ్గింది. హైదరాబాద్లో కూడా కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.