
బంగారం ధరలపై బిగ్ షాక్ తగిలింది. ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతుండగా.. ఇవాళ మరింతగా పెరిగాయి. గత రెండు వారాలుగా పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో మరింత పెరుగుతాయనే అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ధరలు మరింత పెరుగుతుండటంతో అదే నిజమవుతోంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం

హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090 వద్ద కొనసాగుతుండగా.. శనివారం ఒక్కరోజే రూ.1520 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,49,500గా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1400 పెరిగింది. అటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,000 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,48,500 దగ్గర ట్రేడవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,49,500గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,63,240 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,49,650గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,63,090 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,49,500 గా ఉంది.

అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,100 వద్ద కొనసాగుతుండగా.. శుక్రవారం రూ.2.60 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలుగా ఉండగా.. చెన్నైలోనూ ఇదే ధర కొనసాగుతోంది.