
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వంటి అంశాల కారణంగా ప్రపంచ ఆర్థిక వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బంగారంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. దీని వల్ల గత సంవత్సరం బంగారం ధర పెరిగింది.


ఈ పరిస్థితిలో బంగారం ధర లక్ష రూపాయలు దాటవచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు చెబుతుండగా, మరి కొంత మంది బంగారం ధర 30% తగ్గుతుందని చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు బలంగా ఉండటం, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని స్ప్రాట్ అసెట్ మేనేజ్మెంట్ సీనియర్ పోర్ట్ఫోలియో మేనేజర్ ర్యాన్ మెక్ఇంటైర్ అన్నారు.


రోజులలో బంగారం ధర లక్ష రూపాయలకు మించి పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ కిషోర్ నార్నే అంచనా వేశారు. ఇక మార్నింగ్స్టార్కు చెందిన జాన్ మిల్స్ బంగారం ధరలు గ్రాముకు రూ.40,000 వరకు తగ్గవచ్చని అంచనా వేశారు. ఇది ప్రస్తుత ధర కంటే 38-40% తగ్గుదలను సూచిస్తుంది. అయితే, ప్రస్తుత మార్కెట్లో, అధిక సరఫరా, తక్కువ డిమాండ్ ఉంటే, బంగారం ధర తగ్గవచ్చని ఆర్థికవేత్తలు సూచించారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.95,670 వద్ద కొనసాగుతోంది.