
చాలా మంది ఇయర్స్ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి. ఎంత ధరలలో ఉంటాయి అనే విషయాలను బాగా సెర్చ్ చేస్తుంటారు. ఆన్లైన్లో కొనేటప్పుడు రేటింగ్ను చూస్తుంటారు. వెయ్యి రూపాయల కంటే తక్కువ రేట్లలో బడ్జెట్ ఇయర్ఫోన్లు ఏమిటో చూద్దాం.

బోట్ బాస్హెడ్స్ 225: బోట్ కంపెనీకి చెందిన క్లాసిక్ ఇయర్ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్ చేశారు. సౌండ్ క్లారిటీ బాగా ఉంటుంది. వీటి ధర రూ. 399 మాత్రమే.

బోట్ బాస్ హెడ్స్ 242: ఈ ఇయర్ఫోన్స్ ఐపీఎక్స్ 4 రేటింగ్ను కలిగి ఉంది. ఇన్ లైన్ మైక్తో వస్తుంది. తేలికగా ఉంటాయి. సౌండ్ క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. వీటి ధర రూ. 399 మాత్రమే.

జెబీఎల్ సీ200ఎస్ఐ: సౌండ్, అకౌస్టిక్ పరికారాల్లో హర్మన్ కంపెనీకి చెందిన జెబీఎల్ ఎంతగానో పేరొందింది. ఈ ఇయర్ఫోన్స్ ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్ సీ200ఎస్ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్ను కలిగి ఉంది. వీటి ధర రూ.749.

రియల్మీ బడ్స్ 2 నియో: రియల్మీ స్మార్ట్ఫోన్ తన కంపెనీ నుంచి ఇయర్ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. రియల్మీ బడ్స్ టీపీయూ మెటిరియల్తో రూపొందించారు. రియల్మీ బడ్స్ 2 చెవులకు బాగా సరిపోయే విధంగా తయారు చేసింది కంపెనీ. క్లారిటీ ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399.

బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్లెస్ నెక్బ్యాండ్. బ్లూటూత్ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్బై టైమ్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849.