ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకులకు వెళ్లకుండానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ నెలా కట్టాల్సిన కరెంట్బిల్లులు, టీవీ బిల్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ బిల్లు, ఇతర ఈఎంఐలకు అటో డెబిట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.
ఈ ఆటో డెబిట్ సదుపాయం వల్ల బిల్లు గడువు తేదీ మరిచిపోయినా.. సరైన సమయంలో చెల్లింపులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి.
అయితే ఆటో డిబేట్ లావాదేవీలకు సంబంధించిన అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ విషయాలను ఖచ్చితంగా వినియోగదారులు తెలుసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
కొత్త నిబంధనలు ప్రకారం.. క్రెడిట్, డెబిట్కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం.
రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని కస్టమర్కు బ్యాంకులు పంపిస్తాయి.
ఆ తర్వాత పేమెంట్కొనసాగించాలనుకుంటే ఓటీపీతో ఆ పేమెంట్ను నిర్ధారించాలి. అప్పుడే పేమెంట్ పూర్తవుతుంది. అన్ని రకాల క్రెడిట్, డెబిట్కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్వర్తిస్తాయి.