ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది ఖర్జూరం ఇష్టంగా తింటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మితంగా తింటేనే మంచిది. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్లు ఎ, కె, బి-కాంప్లెక్స్ విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.
డయాబెటిస్తో బాధపడేవారు రోజూ 2 లేదా 3 ఖర్జూరాలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరంలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఖర్జూరం తియ్యగా, కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ఖర్జూరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదు.
నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారిని ఇది ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించగల వైద్యం లేనప్పటికీ, దానిని అదుపులో ఉంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సకాలంలో గుర్తించి నియంత్రించాలి. లేదంటే ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది.
ఇందులోని ఫైబర్ కంటెంట్ షుగర్ వారికి హెల్ప్ చేస్తుంది. ఖర్జూరంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉండదు.
ఖర్జూరాల్లోని కాల్షియంతో పాటు మరిన్ని మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సీ, ఏ, ఈ సహా ఇతర విటమిన్లు కళ్లు, రక్తం, జట్టుకు మేలు చేస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచగలదు. శరీరంలో వాపు, మంట తగ్గేందుకు ఖర్జూరాలు తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తని కూడా ఖర్జూరాలు పెంచగలవు. అందుకే ప్రతీ రోజూ వీటిని తప్పక తినమని నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా తింటే ఖర్జూరాల్లోని కార్బ్స్ వల్ల దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడే వారు రోజుకు 2 ఖర్జూరాలు తీసుకోవడం ఉత్తమం. అతిగా తీసుకోవద్దు. అయితే, వీటిని తినే ముందు డాక్టర్ని సంప్రదించాలి. వారిచ్చే సలహాల ప్రకారమే ఈ డేట్స్ని తినడం మంచిది.