టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వేర్’ బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలు మోగిస్తోంది. ఒద్దికగా.. పొందికగా కనిపించే అనుపమ.. ‘టిల్లు స్వేర్’ మువీలో గ్లామర్ గేట్లు ఎత్తేసి ఒక్కసారిగా కెరటంలా ఎగసి పడటంతో అభిమానులంతా షాక్కు గురయ్యారు
మార్చి 29న విడుదలైన ఈ మువీ కుర్రకారును అమితంగా అకట్టుకుంది. ఈ సినిమాకి సిద్ధూ హీరోనే కాకుండా రచయిత కూడా. తనతో నటించిన అనుపమను వంద శాతం ఊహించి కథ రాస్తే.. ఆమె తన నటనతో వెయ్యి శాతం న్యాయం చేసిందని తాజాగా ఓ కార్యక్రమంలో సిద్ధూ అన్నాడు
నిజంగానే నటి అనుపమ పరమేశ్వరన్ ఈ మువీలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇదే విషయమై ఓ విలేఖరి అనుపమను అడిగితే తనదైన శైలిలో సమాధానం చెప్పింది. 'నా తొలి సినిమా ప్రేమమ్. అప్పుడు నాకు 19 ఏళ్లు. నా కెరీర్ ప్రారంభమై సరిగ్గా పదేళ్లవుతుంది. మూడేళ్ల నుంచి ప్రయోగాత్మక పాత్రలను ఎంపిక చేసుకుంటున్నా
అలాంటి టైమ్లో ‘టిల్లు స్కేర్’ కథ నా దగ్గరికి వచ్చింది. కథ చాలా బాగా నచ్చింది. అప్పుడే ఆ సినిమాలోని లిల్లీ పాత్రను వదులుకోకూడదని డిసైడ్ అయ్యా. నా కెరీర్లో ఈ పాత్ర ఎంతో ప్రత్యేకం. గతంలో నటించిన సినిమాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించి బోర్ ఫీలయ్యా. లిల్లీ పాత్ర గ్లామర్తోపాటు పెర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న పాత్ర. ఆ పాత్ర కోసం గ్లామర్గా కనిపించానే తప్ప.. హీరోయిన్ ఇమేజ్ కోసం కానేకాదంటూ..' బ్యూటీఫుల్ నవ్వుతో చెప్పుకొచ్చిందీ కేరళ కుట్టీ
కాగా 'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ మువీకి సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇక సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. త్వరలో టిల్లు 3 కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.