
మీ ఇళ్లల్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా కూడా చుట్టాలు, అతిధులు వస్తారు. వచ్చిన వాళ్ళకి భోజనాలు మంచిగా పెట్టాలి. అయితే , అలాంటి టైమ్ లో మీకు మటన్ 2 కేజీలే దొరికితే ఇలా కొత్తగా వండితే 10 మందికి శుభ్రంగా పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

రెండు కేజీల మటన్ కూరకు కావాల్సిన పదార్దాలు: రెండు కేజీల మటన్, రెండు ఉల్లిపాయలు, రెండు కప్పుల పెరుగు , ఒక టేబుల్ స్పూన్ పసుపు, 5 టేబుల్ స్పూన్స్ కారం, 4 పెద్ద టమాటాలు, 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , మూడు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, మూడు టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడిని తీసుకోవాలి.

రెండు కేజీల మటన్ కూర తయారీ విధానం: ముందుగా మటన్ను మూడు సార్లు కడిగి దానిలో పెరుగు, ఇంకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ దీనిలో వేయాలి. దీనిని 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే మసాలాలు మంచిగా పడతాయి. ఇంకోవైపు గిన్నె పెట్టి అది వేడయ్యాక దీనిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేయాలి.

ఇంకా దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ మసాలా, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, రెండు చిన్న కొత్తిమీర కట్టలు, ఒక కట్ట పుదీనా , రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మ రసంను తీసుకోవాలి. ఇంకా పోపు కోసం కొద్దిగా నూనె, 4 బిర్యానీ ఆకులు, 4 దాల్చిన చెక్క, మూడు లవంగాలు, మూడు యాలకులను కూడా తీసుకోవాలి.

రెండు కేజీల మటన్ కూర రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : చివర్లో రెండు స్పూన్ మిరప కారం, రెండు టీ స్పూన్స్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అర టీ స్పూన్ మసాలా, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి తిప్పుకోవాలి. దీనిలో మేరినేట్ చేసిన మటన్ వేసి బాగా ఉడికే వరకు ఉండనివ్వాలి. ఇంకా ఈ మసాలాలు కూరకు పట్టిస్తే మంచి టేస్ట్ ఉంటుంది.