కేరళలో తెరుచుకున్న శబరిమల ఆలయం, 250 మంది భక్తులకే అనుమతి
కేరళలోని శబరిమలలో స్వామి అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరిచారు. 5 రోజులపాటు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. పూర్తి కోవిడ్ జాగ్రత్తలతో కేవలం 250 మంది భక్తుల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉందని ఆలయ అధికారులు తెలిపారు. వర్చ్యువల్ క్యూ పద్ధతి ద్వారా 246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్టులు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఉందని అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయం చాలావరకు ఖాళీగా కనిపించింది.
కేరళలోని శబరిమలలో స్వామి అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరిచారు. 5 రోజులపాటు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. పూర్తి కోవిడ్ జాగ్రత్తలతో కేవలం 250 మంది భక్తుల ప్రవేశానికి మాత్రమే అనుమతి ఉందని ఆలయ అధికారులు తెలిపారు. వర్చ్యువల్ క్యూ పద్ధతి ద్వారా 246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్టులు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఉందని అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయం చాలావరకు ఖాళీగా కనిపించింది.