ఒడిషాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాఇయయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజగా గడిచిన 24 గంటల్లొ కొత్తగా 2,924 కరోనా పాజిటివ్‌ కేసులు..

Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 1:20 PM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాఇయయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజగా గడిచిన 24 గంటల్లొ కొత్తగా 2,924 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 60,050కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 40,726 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,928 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, రాష్ట్రంలో అన్‌లాక్ 1.0 ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వెయ్యికి పైగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా రెండు వేల మార్క్‌ను దాటుతోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

2,924 new #COVID19 cases &1,521 new recoveries reported in Odisha on 15th August. Total number of positive cases in the state stands at 60,050, including 18,928 active cases & 40,726 recovered cases till date: State Health Department, Odisha

— ANI (@ANI) August 16, 2020

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Latest Articles