Karimnagar District: కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం… లోయర మానేరు జలాశయంలో టోర్నడో

|

Oct 17, 2021 | 7:57 PM

కరీంనగర్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టోర్నడోలు కనిపిస్తుంటాయి.

Karimnagar District: కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం... లోయర మానేరు జలాశయంలో టోర్నడో
Tornado
Follow us on

కరీంనగర్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టోర్నడోలు కనిపిస్తుంటాయి. జిల్లాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అరుదైన దృశ్యం చూడకపోవడంతో..  స్థానిక ప్రజలు ఈ వాటర్ స్పాట్ చూసి ఆశ్చర్యానికి, ఒకింత భయానికి గురయ్యారు.  కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని వచ్చునూర్‌ గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ లో నీరు సుడిగాలిలో చిక్కుకొని తిరుగుతూ ఆకాశంలోకి ఎగసిపోయింది. శనివారం సాయత్రం ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

సాధారణంగా ఇలాంటి టోర్నడోలు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి ఏకంగా గ్రామాలను సైతం నాశనం చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇళ్ల మీదుగా టోర్నడో ప్రయాణిస్తే.. కట్టడాలన్నీ నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాయి. కానీ, కరీంనగర్‌ జిల్లాలో ఏర్పడ్డ ఈ టోర్నడో కేవలం నీటిని తీసుకుపోయింది. ఈ ఆశ్చర్యకర ఘటనను చూసిన స్థానికులు కాస్త ఆందోళన కూడా పడ్డారు. కొందరు మాత్రం కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ చూస్తుండిపోయారు. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న వ్యక్తులు దీన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 30 నిమిపాలపాటు జలాశయంలోని నీరు ఆకాశంలోకి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. కాగా 2016 జూలై 31న ఇదే జలాశయం నడి మధ్యలో వాటర్ స్పాట్ ఏర్పడిందని పలువురు చెబుతున్నారు.

Also Read: ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ