పారితోషికం తగ్గించిన లేడి సూపర్ స్టార్..
దక్షిణాదిలో భారీ పారితోషికం తీసుకుంటున్న లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా పారితోషికం తగ్గించిందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన రెమ్యునరేషన్ను తగ్గించుకుంది. ఇదే ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్. అయితే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయట...
Nayantara Remuneration: దక్షిణాదిలో భారీ పారితోషికం తీసుకుంటున్న లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా పారితోషికం తగ్గించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రజనీకాంత్ సరసన అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన రెమ్యునరేషన్ను తగ్గించుకుంది. ఇదే ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్. అయితే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయట.
సాధారణంగా ప్రతీ సినిమాకు రూ.4 కోట్లు తీసుకునే నయన్ ఇటీవల రజనీకాంత్తో నటించిన ‘దర్బార్’ మూవీకి ఏకంగా రూ.5.5 కోట్లు తీసుకుంది. అది ఒక కార్పొరేట్ సంస్థ. అయితే ఇప్పుడు రజనీతో నటిస్తున్న ‘ అన్నాత్తే’ సినిమాను నిర్మించేది సన్ పిక్చర్స్. అది కాస్తా తమిళనాడుకు చెందిన ప్రాంతీయ సంస్థ. దీనితో నయన్ పారితోషికానికి తూగలేమని నిర్మాణ సంస్థ చేతులెత్తేసిందట. అయితే సినిమాను వదులుకోవడం ఇష్టం లేక ఆమె తక్కువ పారితోషికానికే ఒప్పుకుందని వినికిడి. కాగా, గతేడాది సైరా నరసింహరెడ్డి, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈ లేడి సూపర్స్టార్ తన ఖాతాలో వేసుకుంది.
For More News:
నిర్మాతలుగా మారనున్న లక్కీ కపుల్..?
కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!
వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్గా పవర్ కట్..!