ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్నానంటూ లేడీస్‌ హాస్టల్‌లో దూరిన కిలేడీ.. ఏం చేసిందో తెలుసా..?

|

Feb 10, 2023 | 9:12 PM

ఆ మహిళ తాను ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్నానని, ఐఏఎస్ చదవడానికి కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చానని, గది కావాలని కోరింది. ఆమె చెప్పిన మాటలు నమ్మిన హాస్టల్ వార్డెన్..

ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్నానంటూ లేడీస్‌ హాస్టల్‌లో దూరిన కిలేడీ.. ఏం చేసిందో తెలుసా..?
Coimbatore
Follow us on

కోయంబత్తూరులోని ఓ మహిళా హాస్టల్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారినని చెప్పుకున్న ఓ మాయలేడీ చేతివాటం ప్రదర్శించింది. హాస్టల్‌లో ఉన్న ల్యాప్‌టాప్, నగదు వంటి విలువైన వస్తువులను అపహరించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు జిల్లాలో అనేక కళాశాలలు, పారిశ్రామిక సంస్థలు పనిచేస్తుండగా, శ్రామిక మహిళలు, కళాశాల విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్నారు. దీంతో కోయంబత్తూరులో ప్రైవేట్ మహిళా హాస్టళ్లు ఎక్కువగా నడుస్తున్నాయి.

ఆ విధంగా మదురైకి చెందిన రాజలక్ష్మి అనే మహిళ కోయంబత్తూరులోని ఆర్‌ఎస్‌ పురం ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్‌ మహిళా హాస్టల్‌లో బస చేసేందుకు వెళ్లింది. అప్పుడు ఆ మహిళ తాను ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్నానని, ఐఏఎస్ చదవడానికి కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చానని, గది కావాలని కోరింది. ఆమె చెప్పిన మాటలు నమ్మిన హాస్టల్ వార్డెన్ కార్తియాయిని ఆమెకు వసతి కోసం సగం కేటాయించింది.

ఈ క్రమంలోనే అదును చూసుకున్న రాజలక్ష్మి తోటి మహిళల నుంచి రూ.30 వేల నగదు, రెండు ల్యాప్ టాప్ లు తీసుకుని పారిపోయింది. దీంతో హాస్టల్‌ వార్డెన్‌ కోయంబత్తూరులోని ఆర్‌ఎస్‌ పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాజలక్ష్మిని కూడా వెతికి పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..