వీడిన సస్పెన్స్…… ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశానికి హాజరవుతాం……ఫరూక్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని జమ్మూ కాశ్మీర్ గుప్ కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్ పై ప్రధాని మోదీ ఈ నెల 24 న ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని జమ్మూ కాశ్మీర్ గుప్ కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. బహుశా కాశ్మీర్ కు ప్రత్యేక హోదా లేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడానికి గల అవకాశాలపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మొదట వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి కేంద్రానికి ఆ యోచన లేదని, కాశ్మీర్ లోని నియోజకవర్గాల పునర్వర్గీకరణ పై చర్చించడానికే ఆయన ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారని తాజా సమాచారం తెలిపింది. ప్ప్రధాని ఆహ్వానంపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ , ఫరూక్ అబ్దుల్లా తదితర నేతలు రెండు రోజులపాటు చర్చలు జరిపారు. పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్ కార్ అలయెన్స్ లో ఏడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. పీఎం మీటింగ్ కి వీరు హాజరవుతారా లేదా అన్న అంశంపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదా కూడా ఇవ్వాలన్న తమ డిమాండును ఈ సందర్భంగా ఈ సమావేశం ముందు ఉంచుతామని మెహబూబా ముఫ్తీ తెలిపారు.
కేవలం ఈ డిమాండుతోనే గుప్ కార్ అలయెన్స్ ఏర్పడిందన్న విషయాన్ని విస్మరించరాదని ఆమె చెప్పారు. 370, 35 ఏ అధికరణాల విషయంలో తాము రాజీకి వచ్చేది లేదని అలయెన్స్ సభ్యుడు ముజఫర్ షా తెలిపారు. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ ఏడాది ఆగస్టు లో 370 అధికరణాన్ని రద్దు చేసి..కేంద్రం జమ్మూ కాశ్మీర్ ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి పలువురు నేతలను రాజకీయ నిర్బంధంలో ఉంచింది. కాగా గత డిసెంబరులో అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుప్ కార్ అలయెన్స్ 100 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 74 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Yadadri Temple: విద్యుత్ దీపాలాంకరణలో యాదాద్రి ధగధగ.. శిల్పకళ అద్భుతాన్ని కెమెరాలో బంధించిన ఎంపీ సంతోష్కుమార్
Aadi Saikumar: ఆది కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. హీరోయిన్గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ..