Watch Video: నాలుగు సెకండ్లలో రూ. 40 లక్షలు మాయం.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..!

సరిగ్గా నాలుగే నాలుగు సెకండ్లు పట్టలేదు వాళ్లకి.. ఏకంగా నలభై లక్షల రూపాయలు మాయాం చేశారు. బైక్‌పై డబ్బులతో వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు ఫాలో అయ్యారు. అంతే సిగ్నల్‌ క్రాసింగ్ దగ్గర మెల్లగా అతడి..

Watch Video: నాలుగు సెకండ్లలో రూ. 40 లక్షలు మాయం.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..!
Robbery

Updated on: Mar 07, 2023 | 9:53 AM

సరిగ్గా నాలుగే నాలుగు సెకండ్లు పట్టలేదు వాళ్లకి.. ఏకంగా నలభై లక్షల రూపాయలు మాయాం చేశారు. బైక్‌పై డబ్బులతో వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు ఫాలో అయ్యారు. అంతే సిగ్నల్‌ క్రాసింగ్ దగ్గర మెల్లగా అతడి దగ్గరికి చేరుకుంటూ సెకండ్లలో డబ్బును దోచేశారు. ఆపై అక్కడి నుంచి ఏమి తెలియనట్లు వెళ్లిపోయారు. కాసేపటికి విషయం తెలిసి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు..

రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 38 లక్షలకు రికవరీ చేశారు. అయితే బాధితుడు అనీష్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను మహదేవ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి నార్త్‌ ఎవెన్యూలోని ఒకరికి ఇవ్వడానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ స్మార్ట్ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us