Watch: షాకింగ్‌ వీడియో.. క్షణాల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు.. ఎక్కడంటే!

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుడడంతో నదులు, కాలువలు ఉప్పొంది ప్రవహిస్తున్నారు. ఈ క్రమంలో నదిదాటేందుకు ప్రయత్నించిన ఒక ట్రాక్టర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న 10 మంది కూలీలు గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: షాకింగ్‌ వీడియో.. క్షణాల్లో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు.. ఎక్కడంటే!
Shocking Video

Updated on: Sep 16, 2025 | 3:03 PM

నది దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌తో పాటు 10 మంది కూలీలు కోట్టుకుపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వైరల్‌ వీడియో ప్రకారం.. కూలీలతో వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ ఉదృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు ప్రయత్నించింది. కానీ అది నది మధ్యలోకి రాగానే ఆగిపోయి బ్రేక్‌ డైన్‌ అయినట్టు తెలుస్తోంది. ఎంతసేపటి ట్రాక్టర్ స్టార్ట్‌ కాకపోవడంతో అందులో ఉన్న కూలీలు కాపాడాలని కేకలు వేయడం ప్రారంభించారు. నది ఒడ్డున ఉన్న కొందరు స్థానికులు వారిని గమనించారు.కానీ అంతలోనే నది ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌తో అందులో ఉన్న 10 మంది కూలీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

నిస్సాయంగా ఒడ్డున నిల్చున్న స్థానికులు

అయితే ఒడ్డున్న ఉన్న స్థానికులు చేసేదేమి లేక నదిలో కొట్టుకుపోతున్న వారిని అలానే చూస్తు ఉండిపోయారు. ఎవరైనా వారిని కాపాడండి అంటే కేకలు వేశారు. అయితే నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారంతో చనిపోయి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బాధిత కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.

400 మందిని రక్షించిన సహాయక బృందాలు

ఇదిలా ఉండగా రాత్రంతా కురుస్తున్న భారీ వర్షానికి డెహ్రాడూన్, ముస్సోరీ, మాల్ దేవతా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్ ప్రేమ్ నగర్‌లోని లా కాలేజీ సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్షాలపై సీఎం ధామి స్పందన

భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోని అన్ని నదులు పొంగిపొర్లుతున్నాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. “25 నుండి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయి. అప్రోచ్ రోడ్లు తెగిపోయాయి. ఇళ్ళు, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి” అని ఆయన అన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వీడియో చూడండి..


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.