Trending News: హుండీ లెక్కింపులో అరుదైన దృశ్యం…ఆ సినిమా సీన్ రిపీట్ చేస్తూ ఉత్తరాలు.. ఏం రాశారో తెలుసా..?

ఈ ఆలయానికి సుప్రీం న్యాయమూర్తులుగా ఉన్న ఎస్.ఎ.బోబ్డే, ఎన్.వి. రమణ, రంజన్ గొగోయ్ సందర్శించి పూజలు చేయడం మరింత ప్రత్యేకం.

Trending News: హుండీ లెక్కింపులో అరుదైన దృశ్యం...ఆ సినిమా సీన్ రిపీట్ చేస్తూ ఉత్తరాలు.. ఏం రాశారో తెలుసా..?
Sri Chamarajeshwara Temple

Updated on: Dec 24, 2022 | 5:29 PM

కోరికలు తీరాలని దేవుడికి పూజలు చేయటం, నైవేద్యం పెట్టడం చూశాం. హుండీలో కానుకలు వేయటం కూడా చూస్తుంటాం. అయితే, అలాంటి క్రమంలోనే కానుకలు వేసే హుండీలో అప్పుడప్పుడు కొన్ని వింత వస్తువులు, విచిత్ర లేఖలు ప్రత్యక్షమవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు కర్ణాటకలోని చామరాజనగర్‌లోని శ్రీ చామరాజేశ్వర దేవాలయం హుండీలో ఓ విచిత్ర లేఖ దొరికింది. అది కూడా ఒక అమ్మాయికి సంబంధించినది. హుండీ లెక్కింపు కొనసాగుతుండగా మరో లేఖ కూడా దొరికింది. అందులో దేవుని రాజ్యం దగ్గర్లో ఉందని రాసి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సుమారు ఏడాదిన్నర తర్వాత చామరాజేశ్వర ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. డిసెంబర్ 23 ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో స్వామివారి హుండీని లెక్కించారు. సుమారు రూ. 7 లక్షల రూపాయల హుండీ ఆదాయం సమకూరినట్టుగా తెలిసింది.. హుండీ లెక్కింపు ప్రక్రియలో కొన్ని లేఖలు, ఆహ్వానాలు కూడా దొరికాయి. ఏసు క్రీస్తు జననం గురించి రాసాడు. అతను క్రీస్తును విశ్వసిస్తూ.. దేవుని రాజ్యం సమీపంలో ఉందంటూ లేఖ రాసి హుండీలో వేశాడు. మరో ఒక యువకుడు శివలింగ చిత్రాన్ని గీసి..తన ప్రేమ ఫలించాలని దేవుడిని ప్రార్థిస్తూ లేఖ రాసి హుండీలో వేశాడు. హుండీలో యువతి చిత్రపటం, ఆహ్వాన పత్రాలు కూడా లభ్యమయ్యాయి.

 

ఇవి కూడా చదవండి

7 గంటల పాటు సాగిన హుండీ లెక్కింపులో చామరాజనగర్ తహసీల్దార్ బసవరాజ్, పూజారి రామకృష్ణ భరద్వాజ, జిల్లా ఉప్పర యువజన సంఘం అధ్యక్షుడు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. హుండీలో మొత్తం రూ.7,61,641 ఆదాయం సమకూరింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు అత్యధిక మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఆలయ పునరుద్ధరణ, రథోత్సవాల వల్ల ఇంత డబ్బు సమకూరినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముఖేష్ కుమార్ షా చామరాజ్‌నగర్‌లోని హరలకోటే ఆంజనేయ ఆలయాన్ని సందర్శించారు. హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయానికి సుప్రీం న్యాయమూర్తులుగా ఉన్న ఎస్.ఎ.బోబ్డే, ఎన్.వి. రమణ, రంజన్ గొగోయ్ సందర్శించి పూజలు చేయడం మరింత ప్రత్యేకం.

మౌళిక వసతులు కల్పించేందుకు సూచనలు జిల్లాలోని హనూర్ తాలూకాలోని మలేమహదేశ్వర్ కొండకు వచ్చే భక్తులకు తగినన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చామరాజనగర్‌లో ఇటీవల సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి