Kannauj: కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ కూలి కార్మికులు సమాధి..

ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ పడిపోవడంతో చాలా మంది కార్మికులు సమాధి అయ్యారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ట్యాంకర్‌ సగం కూలిపోయింది.

Kannauj: కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ కూలి కార్మికులు సమాధి..
Kannauj Railway Station Accident

Updated on: Jan 11, 2025 | 4:43 PM

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ట్యాంకర్‌ సగం కూలిపోయింది. పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం వలన చాలా మంది సమాధి అయ్యే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 18 మందిని బయటకు తీసినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో 24-25 మంది కూలీలు పని చేస్తున్నారు. స్టేషన్‌లో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడంతో స్టేషన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.

సంఘటనా స్థలంలో ఉన్న స్థానిక యంత్రాంగం శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించే పనిలో పడింది. ఇప్పటి వరకు 18 మంది కార్మికులను శిధిలాల కింద నుంచి వెలికి తీశారు. జేసీబీ సహాయంతో చిక్కుకుపోయిన ఇతర కూలీలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో పలువురు స్థానిక అధికారులు, రైల్వే అధికారులు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సాంఘిక సంక్షేమ శాఖ సహాయ మంత్రి అసీం అరుణ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

ఇవి కూడా చదవండి

ప్రమాదంలో చాలా మంది కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యి ఉండవచ్చని.. వారి కోసం వెతుకుతున్నామని సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న సుందరీకరణ పనుల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన తీవ్రతను గమనించిన రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని త్వరగా రక్షించేందుకు జేసీబీ సాయం తీసుకుంటున్నారు. తద్వారా కార్మికులను వీలైనంత త్వరగా బయటకు తీయవచ్చు అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై అధికార యంత్రాంగం విచారణ ప్రారంభించింది.

సీఎం యోగి దృష్టికి తీసుకెళ్లారు

ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో భారీగా జనం చేరుకున్నారు. స్థానిక పరిపాలన అధికారులతో పాటు, SDRF బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎం యోగి వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us