
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తన అధికార నివాసం (6, అశోకా రోడ్) వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో టాప్ ప్లేసుల్లో నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి, పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడడానికి గ్రామస్థాయిలో కృషి చేస్తున్నవారిని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం… ప్లాస్టిక్ కాలుష్యం వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం చేయడం, పునరాలోచించడం వంటి చర్యలపై ఫోకస్ పెట్టింది.
On the occasion of #WorldEnvironmentDay, planted a sapling at my residence in New Delhi today.
Furthering the visionary initiative of "Ek Ped Maa Ke Naam", launched by Hon'ble PM Shri. @narendramodi ji, this small step has a powerful impact in creating a cleaner and greener… pic.twitter.com/tiuOgNeQ5P
— G Kishan Reddy (@kishanreddybjp) June 5, 2025
పర్యావరణ పరిరక్షణలో బొగ్గు, గనుల శాఖ కీలక కార్యక్రమాలు తన ఎక్స్ పోస్ట్లో కిషన్ రెడ్డి హైలెట్ చేశారు. అవేంటో దిగువన తెలుసుకుందాం..
గనుల భూమి పునర్వినియోగం: ఈ ఆర్థిక సంవత్సరంలో 2,459 హెక్టార్ల గనుల భూమిని పార్కులు, అటవీ ప్రాంతాలుగా మార్చారు. 54 లక్షల మొక్కలు నాటారు.
సౌరశక్తి ప్రోత్సాహం: 2025-26 నాటికి 3 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని, 2030 నాటికి 9 గిగావాట్ల సామర్థ్యానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
శక్తి మార్పిడి: బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, భారతదేశం పునరుత్పత్తి శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
ఖనిజ భద్రత: గ్రీన్ టెక్నాలజీల కోసం ముఖ్యమైన ఖనిజాల భద్రతను పెంపొందించేందుకు రూ. 16,300 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..