హిమాచల్ప్రదేశ్లోని రోహ్తంగ్ జిల్లాలోని అటల్ టన్నెల్లో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న ఈ టూరిస్ట్ కారు ముందు కారును ఓవర్టేక్ చేసే క్రమంలో పూర్తిగా అదుపు తప్పింది. కుడివైపు గోడను ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా కారునడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా భారత ప్రభుత్వం ఈ అటల్ టన్నెల్ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన సంగతి తెలసిందే. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన నరేంద్రమోదీ అనంతరం దీనిని జాతికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అటల్ టన్నెల్ను వీక్షించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో టన్నెల్ లోపల రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు వాహనదారులకు కొన్ని నిబంధనలు, షరతులు విధించింది. టన్నెల్ లోపల వాహనాల వేగం 60 kmph/hr కు మించకూడదని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే డీఎల్ 10 సీజే 1995 అనే కారు వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పింది. ఏకంగా అటల్ టన్నెల్ గోడను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వాహనం దెబ్బతింది. అయితే ఇదే వేగంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టినా లేదంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టినా భారీ నష్టం జరిగేదని పోలీసులు చెబుతున్నారు.
अटल टनल के भीतर एक पर्यटक वाहन डीएल 10 सीजे 1995 अनियंत्रित होकर दीवार से जा टकराया।#ataltunnelrohtang @JagranNews @mygovhimachal pic.twitter.com/ODfAeUvVYZ
— Rajesh Sharma (@sharmanews778) December 5, 2021
Sonu Sood: రియల్ హీరోకు మరోసారి షాక్.. అక్రమంగా హోటల్ నిర్మించారంటూ..
Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.! అంత ఈజీ కాదు..