భూమి పూజ కోసం అయోధ్య చేరిన ఉమాభారతి

| Edited By: Anil kumar poka

Aug 05, 2020 | 12:37 PM

అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం....

భూమి పూజ కోసం అయోధ్య చేరిన ఉమాభారతి
Follow us on

అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి బుధవారం ఇక్కడికి చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా తాను ఈ కార్యక్రమానికి హాజరు కానని, శంకు స్థాపన ముగిసిన అనంతరం ఈ స్థలాన్ని సందర్శిస్తానని ఆమె ఈ నెల 3 న ప్రకటించారు. అయితే రామజన్మ భూమి సీనియర్ అధికారి ఒకరు తనకు నచ్చజెప్పడంతో ఆ యోచన విరమించుకుని వచ్చానని ఆమె అన్నారు. ఆమెకు రామజన్మభూమి స్థలం వద్ద యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ముకుళిత హస్తాలతో స్వాగతం పలికారు.

అయోధ్య అందరినీ ఏకం చేసిందని, ఇక్కడ వివక్షకు తావు లేదని ఈ దేశం ప్రపంచానికి గర్వంగా చాటిందని ఉమాభారతి పేర్కొన్నారు. ప్రధాని మోదీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం చరిత్రాత్మకమైన ఘటనగా ఆమె అభివర్ణించారు.