AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర.. నాందేడ్ లో ఇద్దరు సాధువుల దారుణ హత్య

మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడుగా భావిస్తున్న భగవాన్ షిండేని  .. ఉమ్రి తాలూకాలోని వారి  ఆశ్రమంలోనే  దుండగులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.  ఆశ్రమంలోని బాత్ రూమ్ వద్ద వీరి మృతదేహాలను కనుగొన్నట్టు వారు చెప్పారు. ఆశ్రమంలోని వస్తువులను దోపిడీ చేయడానికే దుండగులు ఇందులో ప్రవేశించారని, వారిని ఎదిరించబోయిన శివాచార్య ను గొంతు నులిమి హతమార్చారని, ఈ హత్యాకాండను కళ్లారా చూసిన భగవాన్ షిండే ని […]

మహారాష్ట్ర.. నాందేడ్ లో ఇద్దరు సాధువుల దారుణ హత్య
Umakanth Rao
| Edited By: |

Updated on: May 24, 2020 | 4:55 PM

Share

మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. బాలబ్రహ్మచారి శివాచార్యను, ఆయన శిష్యుడుగా భావిస్తున్న భగవాన్ షిండేని  .. ఉమ్రి తాలూకాలోని వారి  ఆశ్రమంలోనే  దుండగులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.  ఆశ్రమంలోని బాత్ రూమ్ వద్ద వీరి మృతదేహాలను కనుగొన్నట్టు వారు చెప్పారు. ఆశ్రమంలోని వస్తువులను దోపిడీ చేయడానికే దుండగులు ఇందులో ప్రవేశించారని, వారిని ఎదిరించబోయిన శివాచార్య ను గొంతు నులిమి హతమార్చారని, ఈ హత్యాకాండను కళ్లారా చూసిన భగవాన్ షిండే ని కూడా హత్య చేసినట్టు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దుండగులు ఆశ్రమం నుంచి లక్షన్నర విలువైన వస్తువులను దోపిడీ చేయడమే గాక శివాచార్య వినియోగించే కారు తాళాలను కూడా బలవంతంగా లాక్కున్నారని ఖాకీలు వెల్లడించారు. దోపిడీ చేసిన వస్తువుల్లో 69 వేల రూపాయల విలువైన లాప్ టాప్ కూడా ఉందన్నారు. దొంగలు సాధువుకు చెందిన కారులోనే పారిపోతుండగా ఆశ్రమ గేటు వద్ద కారు ఆగిపోయిందని, ఆశ్రమంలోని ఇతరులంతా పరుగెత్తుకు వచ్ఛేసరికి టూ వీలర్ పై పరారయ్యారని తెలుస్తోంది.  ఈ కేసుకు సంబంధించి సాయినాథ్ శింగాడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు క్రిమినల్స్ కోసం అయిదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

కర్ణాటకకు చెందిన శివాచార్య కొన్నేళ్ళక్రితమే నాందేడ్ వచ్చారని,  ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంత అభివృధ్దికి తోడ్పడ్డారని తెలియవచ్చింది. మహారాష్ట్రలోనే ఆ మధ్య పాల్గర్ జిల్లాల్లో ఇద్దరు సాధువులను స్థానికులు దారుణంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన ఘటన మరువక ముందే ఈ ఇద్దరు సాధువుల హత్య తీవ్ర కలకలం రేపుతోంది.

మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?
గోల్డ్‌ లోన్‌ వర్సెస్‌ పర్సనల్‌ లోన్‌..! ఏది తీసుకుంటే మంచిది?
'పరాశక్తి' సినిమాను బ్యాన్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్.. ఏమైందంటే?
'పరాశక్తి' సినిమాను బ్యాన్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్.. ఏమైందంటే?