Meghalaya Congress: మేఘాలయాలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రధాన ప్రతిపక్షంగా తృణమూల్

|

Nov 25, 2021 | 7:43 AM

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు గురువారం టీఎంసీలో చేరనున్నారు.

Meghalaya Congress: మేఘాలయాలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రధాన ప్రతిపక్షంగా తృణమూల్
Meghalaya Congress
Follow us on

Meghalaya Congress: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు గురువారం టీఎంసీలో చేరనున్నారు. రాష్ట్రంలో మొత్తం17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తృణమూల్!

మేఘాలయలో ఎన్నికల్లో పోటీ చేయకుండానే టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారనుంది. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి దాదాపు మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. మీడియా కథనాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 1 గంటలకు షిల్లాంగ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ముకుల్ సంగ్మా టీఎంసీ(TMC)లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై మనస్తాపంతో..

మేఘాలయ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చీఫ్‌గా విన్సెంట్ హెచ్.పాలాను నియమించిన తర్వాత సంగ్మా మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్న దాని ప్రకారం ముకుల్ సంగ్మా సెప్టెంబర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కలిశారు. ఆ సమయంలోనే కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భారీ నష్టం వాటిల్లుతుందనే ఊహాగానాలు వినిపించాయి.

కీర్తి ఆజాద్, అశోక్ తన్వర్ కూడా టీఎంసీలో..

మమతా బెనర్జీ నవంబర్ 22 నుంచి 25 వరకు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం(నవంబర్ 23) నాడు మమత ముగ్గురు పెద్ద నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ముందుగా జేడీయూ ఎంపీ పవన్ వర్మ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దీని తర్వాత కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ సతీమణి పూనమ్ ఆజాద్‌తో కలిసి మమత ఎంపీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి చేరుకున్నారు.

ఇప్పటికే ఇక్కడ ఉన్న మమతా బెనర్జీ ఆయనకు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత, హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ అశోక్ తన్వర్ కూడా మమతను కలుసుకుని టీఎంసీ(TMC)లో చేరారు. ఒకప్పుడు రాహుల్‌ సన్నిహితుల్లో తన్వర్‌ కూడా ఉన్నారు. కీర్తి ఆజాద్, అశోక్ తన్వర్ సహాయంతో బీహార్, హర్యానాలో పార్టీ సంస్థను బలోపేతం చేయాలని మమత యోచిస్తున్నారు.

జావేద్ అక్తర్, సుధీంద్ర కులకర్ణి కూడా మమతను కలిశారు

జావేద్ అక్తర్, సుధీంద్ర కులకర్ణి అదేరోజు మమతా బెనర్జీని కలిశారు. కులకర్ణి ఎల్‌కే అద్వానీకి సన్నిహితుడు. దాదాపు గంటపాటు ఈ ముగ్గురి సమావేశం జరిగింది. అయితే వీరి మధ్య ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. కులకర్ణి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయికి సలహాదారు కూడా. వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఎల్‌కే అద్వానీకి సలహాదారుగా మారారు. 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు అద్వానీ ఫర్ పీఎం ప్రచారాన్ని ప్రారంభించిన కులకర్ణి.. రాజకీయ రంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి బద్ధ ప్రత్యర్థిగా పేరు తెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి: International Airport: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.. ఎక్కడంటే..

Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..

Andhra Pradesh Floods: ఏపీలో భారీ వరదలకు, అంతమంది ప్రాణాలు పోవడానికి వారే కారణం.. సీపీఐ రామకృష్ణ సంచలన ఆరోపణలు..