మూడు మెట్రో రైల్వేస్టేషన్లకు మాజీ సీఎంల పేర్లు

|

Jul 31, 2020 | 4:31 PM

అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ చెన్నైలోని మూడు ప్రధాన మెట్రో స్టేషన్లకు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెడుతూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

మూడు మెట్రో రైల్వేస్టేషన్లకు మాజీ సీఎంల పేర్లు
Follow us on

అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ చెన్నైలోని మూడు ప్రధాన మెట్రో స్టేషన్లకు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెడుతూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని అలందూర్‌ మెట్రో స్టేషన్‌కు అరిగ్నార్‌ అలందూర్‌ మెట్రో స్టేషన్, సెంట్రల్‌ స్టేషన్‌కు పురచ్చి తలైవీ డా. ఎంజీ రామచంద్రన్‌ సెంట్రల్‌ మెట్రో, సీఎంబీటీ స్టేషన్‌కు పురచ్చి తలైవీ డా. జే జయలలిత సీఎంబీటీ మెట్రో స్టేషన్‌గా పేరు మార్పుచేసింది. ఈమేరకు ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు స్టేషన్ల పేర్లు మార్చినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో ఈ మూడు స్టేషన్లు ప్రధానమైనవి.

read more:

కరోనా కట్టడిపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు..అప్రమత్తతోనే..

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా

కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి